Thursday, April 18, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లావైయస్సార్ పార్టీ మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు యువనేత పాలకుర్తి దివాకర్ రెడ్డి.

వైయస్సార్ పార్టీ మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు యువనేత పాలకుర్తి దివాకర్ రెడ్డి.

(కౌతాళం ఆంధ్రన్యూస్)

కౌతాళం మండలంలోని తోవి గ్రామంలో వైయస్సార్ పార్టీ మాటలు చెప్పడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం తోవి గ్రామంలో క్లస్టర్ ఇన్ చార్జ్ వెంకటపతి రాజు అధ్వర్యంలో జరిగిన ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గోని ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. వైయస్సార్ పార్టీ ప్రజలను మోసము చేసిన సంగతి ప్రజలు తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ని దింపుతారు అని పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రజలకు వైయస్సార్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు అని తుగ్లక్ పాలన కొనసాగిస్తూ కాలయాపన చేస్తూ అబద్ధపు మాటలు చెపుతూ మాడు రాజధాన్లు పేరుతో చిచ్చు పెడుతూ పరిపాలన చేయడం రాక్షస పాలనకు నిదర్శనం అని పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, ఏరిగేరి బసవరాజు ,ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్ , గణేష్, జి.విజయ్, సోమ్ నాత్, లక్ష్మన్న, కుమర్, అంజి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments