Monday, April 29, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాగుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి.

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి.

ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. సోమవారం ఉదయం నాడు ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఏలేశ్వరం ఎస్సై సతీష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం నగరంలోని దిబ్బలపాలెంకు చెందిన పొన్న గంటి రామకృష్ణ కుమార్తె లోవదుర్గకు భీమవరంకు చెందిన ఎలుబోలు సురేష్ కుమార్ తో గత 8 సంవత్సరాల క్రితం పెళ్లయి, ఆమె తన భర్తతో భీమవరంలో ఉంటున్నారు. తన చిన్నాన్న కుమార్తె 571పెళ్లి సందర్భంగా ఏలేశ్వరం తల్లిదండ్రుల ఇంటికి వచ్చి సుమారు రెండు నెలలు నుండి ఇక్కడే ఉంటూ, సోమవారం తెల్లవారుజామున వాడపల్లి వెంకన్నబాబు దర్శనం నిమిత్తం,అదే వీధికి చెందిన మరో ఇద్దరు ఆడవాళ్ళతో ఆటోలో ఉదయం సుమారు నాలుగు గంటలకు బయలుదేరారు.ఎర్రవరం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్లేసరికి ఆటోలో ప్రయాణం చేయుచున్న లోవదుర్గకు వాంతులు కారణంగా తన తల బయటకు పెట్టి వాంతులు చేసుకొనుచుండగా తుని వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళు తున్న నెంబర్ తెలియని ఐచర్ వ్యాన్ వేగంగా వచ్చి లోవదుర్గ తలను ఢీకొని వెళ్లిపోగా తలకు బలమైన గాయాలు తగిలి రక్తం కారుతుండగా ఆటోలో ఉన్నవాళ్లు ఆటో డ్రైవర్ సాయంతో వైద్యం నిమిత్తం ప్రత్తిపాడు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. ఆమెతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎర్ర వెంకట పద్మ స్టేట్మెంట్ ఇవ్వగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments