(కోసిగి ఆంధ్రన్యూస్)
కోసిగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సభ్యులు జిలాని నేతృత్వంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కే బాబురావు హాజరయ్యారు.ఈ సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో పలు మండలాల్లో వారు కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా 65 మంది చేరడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రాలయం నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సభ్యులు పల్లిపాడు టి లోకేష్ మాట్లాడుతూ పలు గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రైతులకు అండదండలుగా ఉంటూ ఒక్క ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మేలు చేయడంలో ఏ పార్టీకి సాధ్యం కాదని అన్నారు.ఈ సందర్భంలో ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కే బాబురావు మాట్లాడుతూ మంత్రాలయం నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి చాటి చెప్పేందుకు చెప్పేందుకు గ్రామాలను సందర్శిస్తామని అలాగే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అక్క సైనికుని తయారు చేస్తామని సైనికుల ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు గురించి తెలియపరుస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బి అబ్రహం,కోసిగి మండల నాయకులు తాయన్న,ఉల్లిగయ్య, ఆదాము,నజీర్,గౌసియా,ఫరూక్,రాజా,పెద్దజాను కౌతాళం మండల నాయకులు ఎరిగేరి నాగభూషణం,ఈరన్న,ఉరుకుంద రాముడు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రన్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం 9640441653