కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలోని మెలిగానుర్ గ్రామములో ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే క్లస్టర్ ఇంచార్జ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి, ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వ్యతిరేకాలను ఎత్తి చూపి రాష్ట్రంలో జరుతున్నటువంటి అరాచకమైన పాలన ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది, వార్డ్ క్లస్టర్ యూనిట్ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ అసమర్ధత గురించి ప్రజలకు వివరించి, అక్కడి ప్రజల అభిప్రాయాలు స్వీకరించడం జరిగింది… ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్య, అడ్డగోలు నిత్యావసర ధరలు, మద్యపానం, కుంటుపడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, డీజిల్. పెట్రోల్. ధరలు పెంచుతూ త్రాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, రోడ్ల సమస్య, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, నిలకడలేని పాలన, వంటి ఏ రకమైన సమస్య ఉందో అడిగి తెలుసుకుని 9261292612 ఫోన్ నెంబర్ కు వారి మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇప్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వెంకటేష్. పాండు. బసప్ప మరియు కార్యకర్తలు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.