ఆంధ్రన్యూస్ : మండపేట. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేర్చే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆదివారం మండపేట పట్టణంలో పలుచోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 7 8 వార్డుల టీడీపీ ఇన్ చార్జిలు చాపల వీరబాబు, పెందుర్తి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో రెండు చోట్ల ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకులు పంపిణీ చేశారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తొలుత 11వ వార్డు న్యూ కాలనీలోను, పదో వార్డు హరిజనపేటల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే వేగుళ్ళ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏపీఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఉంగరాల రాంబాబు, మోరంపూడి అప్పలరాజు, పెందుర్తి ప్రదీప్ కుమార్, చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, రాయి దొరబాబు, మందపల్లి దొరబాబు, గాలింకి నాగేశ్వరరావు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, కొమ్మరి సత్యనారాయణ, వల్లూరి దొరకయ్య, ఇందిరారాణి, వేగుళ్ళ తేజ, ముమ్మిడివరపు నారాయణరావు, పెందుర్తి వెంకటేశ్వరరావు, సుందరపు గౌతమ్, జట్టు కార్మికులు, పెయింటింగ్ కార్మికులు, అంబేడ్కర్ యువజన సంఘం యూత్ సభ్యులు పాల్గొన్నారు.