మెట్టజ్యోతి శంఖవరం: పది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను పొందవచ్చని మండల అభివృద్ధి అధికారి జే రాంబాబు తెలిపారు. మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో గల సచివాలయం 1 నందు ఆర్థిక సమ్మిళిత వృద్ది లో భాగంగా 10 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కొత్తగా అకౌంట్ లు మరియు,ఇన్సూరెన్స్ పాలసీ లు అప్లై చేయుట, పశువుల కొనుటకు వాటికి నిర్వహించుకోవడం కి లోన్ లు,మరియు అకౌంట్ ద్వారా లభించు ఇతర సౌకర్యాలు పై గ్రామ ప్రజలకు శనివారంఅవగాహనా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీడీవో రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ముఖ్యంగా బ్యాంకు నుండి లావాదేవీలను జరుపుటకు, ఆర్థిక ఇబ్బందులు కొరకు లోన్లు పొందుటకు సులభతరం అవుతుందని తెలిపారు , ….. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ మేనేజర్ ,వైఎస్సార్ నాయకులు బొర్రా లచ్చబాబు గ, పడాల సతీష్ , బందిలి వీరబ్బయి ,పంచాయతీ కార్యదర్శులు కోడూరు శంకరాచార్యులు,సరమర్ల సత్య వెంకటేష్ ,జూనియర్ అసిస్టెంట్ రమణ మూర్తి గారు,వెలుగు సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా
RELATED ARTICLES