శంఖవరం: ప్రతీ ఒకరు ఆరోగ్య వంతమైన జీవితం గడపాలంటే పారిశుద్ధ్యం మెరుగు పడాలని సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యపడుతుంది అని కత్తిపూడి సెక్రటరీ కె శ్రీనివాస్ అన్నారు. మండలం లోని కత్తిపూడి గ్రామం నందు సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, కో ఆప్షన్ గాబు కృష్ణ ఆదేశాలు మేరకు సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య మెరుగుకై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతీ వీధి నందు బ్లీచింగ్ జల్లి పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు విధులు ఎంతో బాధ్యతాయుతమైనవి అని గ్రామ పరిశుభ్రత కార్మికుల పైనే ఆధారపడి ఉందని ప్రతీ ఒకరు గ్రామ అభివృద్ధి కొరకు కష్ఠించి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని విధులు పట్ల అలసత్వం వహించకుండా ప్రతీ ఒకరు బాధ్యతాయుతంగా వ్యవహారించాలని తెలిపారు. కత్తిపూడి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ కావడం వలన పని ఒత్తిడి ఎక్కవగా ఉంటుంది అని అయినప్పటికీ ఒకరికొకరు సహయపడుతూ పారిశుద్ధ్యం మెరుగు పరచేందుకు కృషి చెయ్యాలి అని తెలిపారు. ప్రతీ వీధిలో ప్రతీరోజూ పర్యటిస్తూ చెత్త ఎక్కడా నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి అని డ్రైనేజీలు కూడా ప్రతీ రోజూ శుభ్రపరచాలని సూచించారు.ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రపరుస్తూ ,దోమలు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు వీరబాబు ,శివరామకృష్ణ,,సిబ్బంది మహేష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ పారిశుద్ధ్యంతో గ్రామ అభివృద్ధి.
RELATED ARTICLES