పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు అంటున్నారు జగన్ రెడ్డి రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో టిడిపి నాయకుడు శంకర్.

0
257

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండలం తోవి గ్రామము టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్క రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ అని ఈరోజు తోవి గ్రామంలో టిడిపి నాయకులు శంకర్ సోమనాథ్ ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని మన రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు వారి ఫోనుతో 9261292612 మిస్సేడ్ కాల్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరూ కూడా సుభిక్షంగా ఉంటాము అన్నారు. తోవి గ్రామ యువ నాయకుడు విజయ్ మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చే మూడున్నర సంవత్సరాల అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను నవరత్నాలు పథకాలతో ప్రజలను నట్టేట ముంచారు. నిత్యవసర సరుకులు పెంచుకుంటూ అదేవిధంగా నిజమైన నిరుపేద పింఛన్దారులను కూడా పింఛన్ తొలగింపు చేయడం చాలా సిగ్గుచేటు ఇలాంటి నీచ రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు నిరుపేదలను ఆదుకునే దేవుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ నారా చంద్రబాబునాయుడు రావాలి అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తాం అని గ్రామంలో ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ సోమనాథ్ కుమార్ గణేష్ నారాయణి యువ నాయకుడు విజయ్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here