కౌతాళం అక్టోబర్ 11 (ఆంధ్ర న్యూస్ )కౌతాళం మండలం లో ఈ దినం డప్పు కళాకారుల సమస్యలపై సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు డప్పు తో ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతున్న కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.తిక్కప్ప, రైతు సంఘం నాయకులు మల్లన్న మాట్లాడుతూ డప్పు కళాకారులకు, చర్మకారుల కు, కాటికాపరి గుంతలు బేగరులకు ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఇవ్వాలని, ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఆత్మ గౌరవంగా బ్రతకడానికి మూడెకరాల భూమి,3 సెంటు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 14వ తేదీ జరిగే కలెక్టర్ కార్యాలయం డప్పు కళాకారుల సమస్యలపై పెద్ద ఎత్తున డప్పు కళాకారులు కదలాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శి సలపురం తాయప్ప,మారెన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈరన్న, అదేవిధంగా డప్పు కళాకారులు వీరన్న, నరసప్ప, చిన్న వీరేశ్, అయ్యన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823