సామర్లకోట ప్రధాన పోస్టల్ కార్యాలయ అధికారి V.చింతామణి.
ఆంధ్రన్యూస్ : సామర్లకోట. ఆడపిల్లల వివాహ భద్రతలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఆడ పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ సత్వర సద్వినియోగం చేసుకోవాలని సామర్లకోట ప్రధాన పోస్టల్ కార్యాలయ అధికారి అయిన V.చింతామణి, అలాగే A.P.M కె.అజయ్ కుమార్ లు పేర్కొన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకo పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు స్థానిక బి.బి.ఆర్.కె మునిసిపల్ ప్రైమెరీ పాఠశాల లో సిబ్బంది ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పై వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారి చింతామణి మాట్లాడుతూ పదేళ్లలోపు వయసున్న ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు వారి యొక్క ఆర్థిక స్థోమతను బట్టి సంవత్సరానికి లక్షా 50 వేల రూపాయల వరకు ప్రీమియం గా చెల్లించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహిళలకు హార్దికంగా చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలను అమలు చేయడం దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా చెప్పాలన్నారు. అందులో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక పరిపుష్టిని కేంద్ర ప్రభుత్వం కలిగించడం జరిగిందని పోస్ట్మాస్టర్ చింతామణి పట్టణ ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో దాతలు ఎవరైనా ముందుకొస్తే వారందరిని భాగస్వాములు చేసి తద్వారా ఆడపిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముందుకు సాగుతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సులక్షణదేవి, దుర్గాప్రసాదు, రాఘవ, ప్రకాష్ బాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.