
మెట్టజ్యోతి : బిక్కవోలు. బిక్కవోలులోని భారత సంస్థ గోదాముల వద్ద వేంచేసియున్న సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది.
FCI గోడౌన్స్ జట్టు ఆధ్వర్యంలో సుమారు యాభై ఏళ్లుగా. ప్రతియేటా ఈ సత్తెమ్మ తల్లి సంబరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి విశేషంగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి తరించగా FCI జట్టు భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.



