కౌతాళం నవంబర్ 10 ఆంధ్ర న్యూస్ :కౌతాళ మండల పరిధిలోనీ ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ఎమ్మిగనూరు వాస్తవ్యులైన ఏ వీరేశ్ & ఏ కృష్ణ వారు రు .50,116/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈరన్న స్వామి మరియు దేవస్థాన సిబ్బంది నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823