కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలోనీ శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు బెంగళూరు వాస్తవ్యులు లేట్ తుంబలం గుత్తి గోవిందశెట్టి మరియు శ్రీమతి శకుంతల 50,000/- రూపాయ విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రకాష్ స్వామి దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.