కౌతాళం నవంబర్ 23 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలం పరిధిలో ఉరుకుంద గ్రామం వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ఆదోని వాస్తవ్యులు కోటినీనే లక్షమ్మ, కోటినీనే నాగరాజ్ మరియు రంగన్న వారు .1,01,116/- రూపాయలు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రామలింగారెడ్డి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823
శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి రాజ గోపురం నిర్మాణం కొరకు విరాళం అందజేత.
RELATED ARTICLES