Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedర్యాగింగ్ చేసిన సైఫ్ ని కఠినంగా శిక్షించాలి

ర్యాగింగ్ చేసిన సైఫ్ ని కఠినంగా శిక్షించాలి

మహిళలకు రక్షణ కల్పించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత

మెట్టజ్యోతి :- భద్రాద్రి కొత్తగూడెం. కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి పై ర్యాగింగ్ చేసి మానసికంగా వేధించిన సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ ని ర్యాగింగ్ నిరోధక చట్టం క్రింద వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు మణుగూరుు మండలంలోని పీవీ కాలనీ లో ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహిళలతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైద్య విద్యార్థిని ప్రీతి ని వేధించిన ఘటనలో నిందితుడు డాక్టర్ సైఫ్ కు రాజకీయ నేపథ్యం ఉందని ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం కొనసాగుతుందని గతంలో కూడా బంజారాహిల్స్ మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటనలో కూడా రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయని ప్రీతి కేసులో కూడా అదే ప్రయత్నం కొనసాగుతుందని ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అనుమానాలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్ పై కూడా అనుమానాలు ఉన్నాయని అదే నిజమైతే ఆయనపై కూడా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు అలాగే మహిళల వేధింపులు, చెడు వ్యసనాలు బంగారు భవిత పై బాధ్యతలేని యువతరంలో మార్పుకై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యారంగం సినిమా రంగాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీని గౌరవించే విషయంలో సమూల మార్పు తెచ్చే అవసరం ఎంతగానో ఉందని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదిక కావాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థలు కూడా యువతలో మార్పుకై పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కే రమాదేవి, నాగమణి,కమల, వాణి,ఎం మోహన్,శివ,సతీష్,తదితరులు పాల్గొన్నారు


REPORTER : V RAMARAO

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments