కౌతాళం నవంబర్ 14 ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటిగా నిలిచిన కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మినరసింహ ఈరన్న స్వామి దేవస్థానమునకు హైదరాబాద్ వాస్తవ్యులు కే బాలకృష్ణ ఆచారి వారు 500 గ్రాముల వెండిని విరాళంగా చెల్లించియున్నారు. మరియు దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ముఖ్యల ( తుగ్గలి మండలం) వాస్తవ్యులైన జ శివశంకరయ్య 50,000/-రూపాయలు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి, రిసిప్ట్ అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కే వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823