కౌతాళం అక్టోబర్ 18(ఆంధ్ర న్యూస్) మండలంలోని ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు కర్నూలు వాస్తవ్యులైన కటేగర్ కుమార్ Rs.1,00,001/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823