మల్కిపురం : రాష్ట్ర పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను నాయ
కులుఅంతావిధిగా నిర్వహించాలని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. లక్కవరం ఎం జి గార్డెన్స్ లో మాజీమంత్రి గొల్లపల్లిసూర్యారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చిటికిన రామ్మోహనరావు, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశించిన ప్రకారం రాజోలు నియోజకవర్గంలో విజయవంతం గా నిర్వహించటం జరిగిందన్నారు. గౌరవ సభలు, సభ్యత్వాలు, బాదుడే బాదుడు, సంస్థాగత కమిటీలు, సెక్షన్ ఇంచార్జీలు, బూత్ కమిటీలు, యూనిట్ ఇంఛార్జీలు, క్లస్టర్లను, నియమించుకుని, ఓటర్ సర్వే కార్యక్రమం ను విజయవంతంగానిర్వహించి,పార్టీ కార్యక్రమాలలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు అంతా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీకి విజయానికి కృషి చెయ్యాలని అన్నారు.నియోజకవర్గ పరిశీలకులు చిటికిన రామ్మోహనరావు మాట్లాడుతూ ఈ వైస్సార్సీపీ పరి పాలనలో బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. బి సి లకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులను ప్రక్క త్రోవ పట్టించి బలహీన వర్గాలను ఆర్ధికంగా క్రుంగ దీసిందన్నారు. రాజోలు నియోజకవర్గంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారని రాజోలు నియోజకవర్గం గొల్లపల్లి సూర్యారావు గెలుపు బాటలో నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిధి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని నలబై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. అటువంటి నాయకుడు రాజోలు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉండటం నియోజకవర్గ కార్యకర్తల అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రాజోలు నియోజక
వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు గొల్లపల్లి అన్నారు. పార్టీ ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా ప్రతీ కార్యక్రమాన్ని భాద్యతతో చేస్తున్నారని, సూర్యారావు కి వెన్ను దన్నుగా నిలుస్తున్న రాజోలు నియోజకవర్గ కార్యకర్తలను అభినందిస్తున్నాను అన్నారు. భోజన విరామ సమయ అనంతరం లక్కవరం ప్రధాన రహదారుల్లో జగన్మోహన్ రెడ్డి పాలన పై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంగెన భూదేవి నాని, రుద్రరాజు వెంకటరమరాజు, మంగెన రాధాకృష్ణ మూర్తి, చెల్లింగి అబ్బులు, అడబాల సాయిబాబు, పిల్లి శ్రీరామ్మూర్తి, కసుకుర్తి త్రినాధస్వామి, కేతా శ్రీనివాస్, అడబాల యుగంధర్, రాపాక నవరత్నం, గుబ్బల శ్రీనివాస్, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, పిండి సత్యనారాయణ, రుద్రరాజు బంగార్రాజు, ఈలి శ్రీనివాస్, మోకా పార్వతి, బందెల పద్మ, చెల్లుబోయిన హెలీనా హరికృష్ణ, పోతురాజు కృష్ణ, అడబాల చంటి, మెరుగుమువ్వల సత్యవరప్రసాద్, పొలమూరి శ్యాంబాబు,పితాని సూరిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, కడలి కృష్ణ మనోహర్, గొణిపాటి రాజు, చిట్టూరి సంతోష్, నార్కెడమిల్లి విష్ణు, గుద్దటి చిట్టబ్బాయ్, నాగిరెడ్డి గోపి తదితరులు పాల్గొన్నారు.