
(కర్నూలు ఆంధ్రన్యూస్)కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డివో ఆదేశాల మేరకు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించామని ఆమె పేర్కొన్నారు. ఈ సెలవు ప్రకటించడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు మూడు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ఆధారంగానే తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురవడం ప్రారంభమైంది అందుకే ఈ సెలవు ప్రకటించాము.అయితే ఈరోజు ఇచ్చిన సెలవును రెండో శనివారము రోజుని విద్యార్థులకు పాఠశాలలో యదవిధిగా విద్య బోధన అందించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శోభారాణి తెలిపారు.



