
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
ఆదోని మండలం ధనాపురం గ్రామంలో హై స్కూల్ దగ్గర రోడ్డు మార్గంలో భారీ గేట్లు ఏర్పాటు చేయాలని,సర్కిల్ ఇన్స్పెక్టర్ శిశిద దీప్తి అధికారికి వినతి పత్రం అందజేసిన DSF జిల్లా అధ్యక్షుడు. ఈ సందర్భంగా
వినతి పత్రాన్ని ఉద్దేశించి DSF జిల్లా అధ్యక్షుడు ధనపురం ఉదయ్ మాట్లాడుతూ ధనాపురం గ్రామంలో హై స్కూల్ పాఠశాలకు వందల మంది విద్యార్థులు చదువుకోడానికి వస్తున్నారు.కానీ అక్కడ భారీ గేట్లు లేనందువల్ల వాహనాలు అతివేగంగా రావడం వల్ల విద్యార్థులు స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కావున పాఠశాల ఓపెన్ అయ్యేసరికి అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కి తెలియపరచడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శిశిద దీప్తి అధికారి స్పందిస్తూ తక్షణమే ధనాపురం గ్రామానికి సంబంధించిన ఎస్సైకి చెప్పి తక్షణమే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది DSF జిల్లా అధ్యక్షుడు ధనపురం ఉదయ్ తెలియజేశారు.



