
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండలో
దేశవ్యాప్తంగా GST నూతన స్లాబులు అమలు అవుతున్న సందర్భంగా,ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదములు తెలియచేస్తూ,పత్తికొండలో ర్యాలీ పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్ మరియు పత్తికొండ మండల అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ పాల్గొనారు.మొదట సావరమ్మ దేవతల నుండీ ర్యాలీ మొదలై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సర్కిల్ వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం నాలుగు స్థంబాల సర్కిల్లో,నరేంద్ర మోడీ మరియు నిర్మలా సీతారామన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,జిల్లా నాయకులు,పత్తికొండ అసెంబ్లీ నాయకులు పాల్గొనడం జరిగింది.



