ఆంధ్రన్యూస్ : జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లిని, సొంత ఊరిని మరువకూడదు అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటల ప్రేరణతో ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన దాడిశెట్టి అనంత బాబ్జి తన గ్రామ అభివృద్ధికి, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ఏలూరు గ్రామంలో కొన్ని వీధుల్లో కుటుంబాలు “లో- వోల్టేజీ” సమస్యతో నాణ్యమైన కరెంటు అందక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన బాబ్జి సొంత ఖర్చులతో 2 ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. బాబ్జి సహకారంతో గ్రామ ప్రజలకు “లో వోల్టేజీ” సమస్య తీరి వాళ్ల ఇళ్లలో వెలుగు నింపారు. బాబ్జి గ్రామ ప్రజలకు అందిస్తున్న సేవను పలువురు కొనియాడారు.