
తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి పాంగి నరసింగరావు
డుంబ్రిగూడ,: మెట్ట జ్యోతి, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో యువగళం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు నార చంద్రబాబు నాయుడు, నార లోకేష్, కింజరాపు అచ్చేం నాయుడు రాష్ట్ర శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తున్నారని దీని వలన రాష్ట్రంలో శాంతి భద్రత భంగం కలిగిస్తుందని ఇలాంటీ వాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలనిఅరకులోయ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ పాంగి నరసింగరావు అన్నారు 2024లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని గుర్తు చేశారు టిడిపి నాయకులపై డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ముత్తెం వినోద్ కుమార్ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు వంతల మోహన్ రావు, వంతల లవకుషా తదితరులు పాల్గొన్నారు.



