
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయని నియోజకవర్గం ఎమ్మెల్యే స్వగృహం నందు వైఎస్సార్సీపీ కోసిగి మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా చిన్నబొంపల్లి గ్రామానికి చెందిన కందుకూరు త్యాగరాజు మరియు చిన్నబొంపల్లి గ్రామ నాయకులు,ప్రజలు,అభిమానులు కలసి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కందుకూరు త్యాగరాజు మాట్లాడుతూ మాట తిప్పని మడమ తిప్పని మాట ఇచ్చిన ప్రకారంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఉన్నత స్థానాన్ని కలిపిస్తానని ఆమె ఇచ్చిన ప్రకారంగా ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కు మా తరపున మరియు మా గ్రామం తరపున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె.హుసేన్,వైస్సార్సీపీ నాయకులు ఆర్.లక్ష్మయ్య,జె.ఆంజనేయ.కె.రాగప్ప,ఆర్.డోమయ్య,వైసీపీ యూత్ పాల్గొనడం జరిగింది.(ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి.అబ్రహం 9640441653.)



