కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సంధర్బంగా దేశంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు కోసం పని చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు,వారు కౌతాళం మండల హెడ్ క్వార్టర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసు లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగు బాషా,సినిమా, రాజకీయాలు, తదితర రంగాలకు ఎనలేని కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని వారి ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చి దేశములో పెను మార్పు తెచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలు కోసం పని చేసి దేశ రాజకీయాల్లో తెలుగు జాతిని అగ్ర స్థానం లో నిలబెట్టి ఈనాటికీ ప్రజలు గుండెలో స్ధిరమైన స్ధానం సంపాదించిన నేత ఎన్టీఆర్ మాత్రమే అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,జిల్లా కార్యదర్శి బాపురం శివమోహను రెడ్డి,జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు,టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోతులదోడ్డి శివమూర్తి,బాపురం వెంకటరెడ్డి,రమేష్ గౌడ్,కుంటనహళ్లు దోడ్డన్నగౌడ్,డాక్టర్ రాజానంద్,సిద్ధు,ఏరిగేరి బసవరాజు,శివప్ప గౌడ్,ఓబులాపురం నరసింహులు,కామవరం నభిసాబ్,బదినేహల్ నరసింహులు,ఉమేష్,యస్ సి సెల్ నాయకులు ఉరుకుందు సర్పంచ్ సురేంద్ర,జిల్లా కార్యదర్శి రాజాబాబు,ఏరిగేరి డేవిడ్,గాబ్రియేల్,ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్,దుద్ది ఉసేని,ఏరిగేరి విరేష్,తదితరులు పాల్గొన్నారు.