
కె ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ కర్రి రామకృష్ణారెడ్డి గారి సేవలు అభినందనీయం
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ బ్యూరో ప్రసాద్ పలివెల : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో బహుజన సేవక్ సంఘ్ గా ఆవిర్బవించి తరువాత కాలం లో కె ఆర్ కె సంక్షేమ చారిటి ట్రస్ట్ గా రూపుదిద్దు కొని ఎంతో మంది నిరుపేదల కు ఆసరా గా నిలిచింది. మండలం లో ఎక్కడ లేని విధంగా మూడు పూటలా సుమారు అరవై మంది వృద్దులు కు వికలాంగులకు అండగ నిలవడానికి గల కారణం అయిన కె ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ కర్రి రామకృష్ణా రెడ్డి ని గ్రామ ప్రజలు ప్రశంసలు తో కొనియాడారు కరోనా లాంటి కష్ట కాలం లో కూడా ప్రపంచం స్థంభించిన రోజులలో కూడా ట్రస్ట్ కార్యక్రమం లు ఆపకుండా రావడానికి ఇబ్బంది పడిన వృద్దులుకు క్యారేజ్ లు ద్వారా భోజనం అందించడం జరిగింది, ప్రతీ రోజు ఆకలి అని వచ్చిన వారికి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించడం విశేషం. అన్నదానం తో పాటు అనేక సేవా కార్యక్రమం లు నిర్వహిస్తూ నేటి తో మూడు వసంతాలు పూర్తిచేసుకొని నాలుగో వసంతంలో కి అడుగుపెడుతున్న సందర్బంగా ట్రస్ట్ కార్యవర్గం కృష్ణా రెడ్డి కి అభినందనలు తెలిపారు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఒక్కరోజు అన్నదానం చేస్తే చాలు అనుకొనే ఈ రోజుల్లో మూడు సంవత్సరాలు మూడు పూటలు నిరాటకంగా అన్నదానం చేస్తున్నారు అంటే ట్రస్ట్ చైర్మన్ కృష్ణా రెడ్డి సేవలు వెళ్లకట్టలేనివి అని బిక్కవోలు మండల మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి.వి.ఎస్ సత్యనారాయణరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు కర్రి రామకృష్ణారెడ్డి (సి.వి.ఆర్) ట్రస్ట్, కార్యదర్శి రేవు సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ప్రసాద్ పలివెల, మీడియా కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేసారు..



