
ఏఈ మల్లయ్య పైన తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండుపోగుల నేపాల్ వినతి.
మంత్రాలయం మండలం చిలకలడోణ బూదూరు గ్రామంలో ఏఈ మల్లయ్య మరియు కాంట్రాక్టర్ రఘు పై చర్యలు తీసుకోవలని జాయింట్ కలెక్టర్ కి వివరించడం జరిగింది. సీ సీ రోడ్లు పూర్తి చేయకుండగా సగం వేసి సగం మధ్యలో వదిలేయడం జరిగింది ఎందువలన అని ప్రశ్నిస్తే నీవు ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో మేము రోడ్డు వేసేది ఇంతే అంటూ సమాధానం దాటి వేస్తున్నాడు. అందువలన సబ్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. చిలకబడోణ గ్రామంలో సీసీ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్ట్ యాజమాన్యం బిల్లును తక్షణమే నిలిపి నివేయాలని అలాగే వారి లైసెన్స్ రద్దు పరచి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవలని విన్నవించుకోవడం జరిగింది. అలాగే చిలకలడోన గ్రామంలో ఉండే మూడు సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలని వివరించడం జరిగింది. చిలకలడోణ గ్రామంలో సీసీ రోడ్లు లేనందువలన నానా అవస్థలు పడుతున్నారు మరియు వర్ష కాలంలో నీరు చేరి మురికి గుంతలుగా మారి అక్కడ వుండే ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. చిలకలడోన గ్రామంలో సీసీ రోడ్డు నాణ్యత అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు యాకోబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రన్యూస్ రాయలసీమ ప్రతినిధి అబ్రహం 9640441653.



