(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రముగా ఒకటిగా నిలిచిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు గుడికల్లు వాస్తవ్యులు ఉల్లిగయ్య బి నారాయణ 1,01,116/- రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. విరళంగా అందజేసిన దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం,స్వామివారి శేష వస్త్రాము,లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉమేష్ స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.