ఆంధ్రన్యూస్ : స్వతంత్ర భారతదేశంలో స్వయంసమృద్ధి భారతావనికి అంకురార్పణ పలికింది మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ కొనియాడారు. స్థానిక కాకినాడ రామకృష్ణ రావు పేట లోని శాస్త్రి గారి మరియు మహాత్మా గాంధీ గార్ల విగ్రహాలను బీజేపీ నాయకులు స్థానికులు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ 1960 దశకంలో ఆహార కొరతతో సతమతమవుతూ కేవలం దిగుబడులు పైనే ఆధారపడుతున్నారు భారతదేశానికి హరిత విప్లవం వైపు నడిపించి స్వయం సమృద్ధ భారతావనికి తొలి అడుగు వేసిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని గుర్తు చేశారు. వారి అడుగు జాడల్లోనే నేటి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాలలో స్వయంసమృద్ధ భారతావనిని సాధించాలన్న సత్సంకల్పంతో ముందుకు వేగంగా దూసుకుపోతున్నారని ఈ మహాయజ్ఞంలో యువత అండగా నిలబడాలని రవి కిరణ్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడా వెంకటనారాయణ, రాష్ట్ర దళిత మోర్చ కార్యవర్గ సభ్యులు పైడిమళ్ల చేరియన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.