
కౌతాళం నవంబర్ 16 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలం పరిధిలో అగశాల దిన్నె గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ అందజేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వారిని వై బాలనాగరెడ్డి అడిగి తెలుసుకోవడం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలతో పాటు ప్రయోజనాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వాస నియతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె చెందుతుందని రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ కృషి చేస్తున్నారని తెలిపారు సచివాలయ వల్ల వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి దగ్గరికి అందిస్తున్నారని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు జడ్పిటిసి ఎంపిటిసిలు సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాల సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.



