కౌతాళం డిసెంబర్ 08 ఆంధ్రన్యూస్ కౌతాళం మండలంలోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్ మంత్రాలయం నియోజకవర్గం ఉపాధ్యక్షులు బిటి రామ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్థానిక కౌతాళం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిరసనగా తెలుపాము అనంతరం టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్నందున ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలు (ప్రభుత్వ పాటశాల లు ప్రభుత్వ ఇంటర్ కలశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల)ఏర్పాటు చేసి సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు తో విద్యా అభివృద్ధి కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు అద్దాల శ్రీరామ్ నాగరాజు మైబు మాట్లాడుతూ బడికి వెళ్లాల్సిన విద్యార్థులు వలసలకు వెళ్లి కూలీలుగా తయారు అవతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చెయ్యాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823