కౌతాళం డిసెంబర్ 09:ఆంధ్రన్యూస్
కౌతాళం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉన్న విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరి విరిగి పడే అవకాశం ఉందని తెలయడంతో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్తగా పోల్ లను ఏర్పాటు చేయాలని కోరారు. టిఎన్ఎస్ఎఫ్ మంత్రాలయం ఉపాధ్యక్షులు బి. టి రామచంద్ర మాట్లాడుతూ విద్యుత్ తీగలు తెగిపడితే చిన్నారులకు, వాహనదారులకు తీవ్ర ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని. వెంటనే అధికారులు స్పందించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దాల శ్రీరామ్. నాగరాజు. మైబు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823