పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన దాడి పిరీకిపంద చర్యని అంటున్న కౌతాళం మండల కన్వీనర్ ఉలిగయ్య.

0
171

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండల పరిధిలో గోతలదొడ్డి గ్రామములో తెదేప మంత్రాలయం సీనియర్ నాయకులు ఉల్లిగయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన దాడి
పిరీకిపంద చర్య అని మండల కన్వీనర్ ఉలిగయ్య అన్నారు.ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాచర్ల ఏమైనా మీ అబ్బ జాగీర్ కాదని అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూసి నిన్న జరిగినటువంటి ఇదేమి కర్మ కార్యక్రమానికి ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే టిడిపి నాయకులపై కార్యకర్తలపై దాడులు చేశారని మరియు ఆయన ఇంటికి నిప్పంటించి నువ్వు శునకానందం పొందుతున్నావని అక్కడ నీ అనుచరుడు రౌడీషీటర్ అయినటువంటి తురక కిషోర్ ఇంతకుముందు కూడా టిడిపి నాయకులపై దాడులు చేశాడని త్వరలోనే నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేస్తారని ధ్వజమెత్తారు. అలాగే ఇంత దాడి జరుగుతున్న కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని అన్నారు… ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి చూడి రోహిత్ గ్రామ సర్పంచ్ భర్త లక్కే గోవిందు తెలుగు యువత నాయకులు పైగేరి నాగరాజు వీరేష్ మరియు సురేష్ నాయుడు యువసేన మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here