కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలో రౌడూరు గ్రామంలోమన ప్రియతమ నాయకులు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి , యువ నాయకులు వై.ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో 1 వ రోజు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి శాసనసభ్యులు వై, బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి , ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న వీరికి మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎమ్మెల్కే, యువ నేత కు సన్మానం చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి ప్రభుత్వం పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు జడ్పీటీసీ, ఎంపిపి, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు గ్రామంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు,సంబంధిత అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు