మెట్టజ్యోతి, ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో సోమవారం పోలీసులు గ్రామస్తులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు, రాజవమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్, పలు అంశాలపై వివరణ ఇచ్చారు, చట్ట వ్యతిరేక కార్యకలాలపై అవగాహన కల్పించారు, ఆన్లైన్ లో అప్పు మనకి మన పిల్లలకి ప్రాణాలకు ముప్పు తెస్తుందని లోన్ యాప్ ద్వారా రుణాల పొంది మోసపోవద్దని, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి, వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో కిండ్ర గ్రామ ప్రజలు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు,