కౌతాళం అక్టోబర్ 17(ఆంధ్ర న్యూస్)
కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ఎమ్మిగనూరు వాస్తవ్యులైన ఉప్పర్ సన్న హల్లయ్య గRs.1,00,116/- చెక్కు రూపేణా విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823