కౌతాళం డిసెంబర్ 09 ఆంధ్రన్యూస్
కౌతాళం మండలంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం మండలం కేంద్రం అయినా చూడి గ్రామంలో మండలం కన్వీనర్ ఉలిగయ్య మరియు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జి కొట్రేష్ గౌడ్ అధ్యక్షతన చూడి గ్రామములో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి సమస్యలను. కష్టాలను తెలుసుకున్నారు. మండల నాయకులు ఉల్లిగయ్య మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త అరాచక విధానాలతో ప్రజల జీవనం దుర్భరంగా మారిందని గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన భారాలను మోపిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ యువనేత సురేష్ నాయుడు మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్ సీఎం అయిన తర్వాత మన రాష్ట్రానికి పట్టిన ఖర్మను గురించి వివరించడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, చెప్పేది ఒకటి చేసేది ఒకటని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రైతులకు నీరు పుష్కలంగా ఉన్న పంటలు వేసే పరిస్థితి లేదని, గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని విమర్శించారు.నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటిని తగ్గించాలని ఆలోచన జగన్ కి లేకపోవడం బాధాకరం అని చెప్పారు. కోటేష్ గౌడ్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల వల్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, వారి కష్టాల్లో బాధల్లో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దప్ప, పెద్దోడు, మల్లప్ప గౌడ్,శివప్ప గౌడ్,రామలింగ, బసవరాజు,గోవిందు, సురేష్, కృష్ణ, గుడిసిలి అల్లయ్య, రంగస్వామి కురువ నాగేష్, పూజారి మల్లేష్, మాజీ ఎంపీటీసీ ఈరేష్, తాయన్న, బోయ ఈరేష్, బోయ గురు లింగ, సన్నెప్ప వడ్డే సుల్తాన్, వడ్డే బుడుదొడ్డి తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823