కౌతాళం (ఆంధ్రన్యూస్). కౌతాళం మండలం బదినేహాల్ గ్రామము నందు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్క రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ అని ఈరోజు బదినేహాల్ గ్రామంలో బీసీ కాలనీలో గ్రామ నాయకులు మాటూరు నరసింహులు ఉమేష్ గౌడ్ ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని మన రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరూ కూడా సుభిక్షంగా ఉంటాము ప్రజలు అన్నారు. ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చే నాలుగున్నర సంవత్సరాల అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు నిత్యవసర సరుకులు ధరలు మద్యపానం రోడ్డు సమస్య నిధులు దుర్వినియోగం గిట్టబాట ధరలు నిలకడ లేని పాలన అదేవిధంగా నిజమైన నిరుపేద పింఛన్ తొలగించడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజు దగ్గరలో ఉన్నది.
RELATED ARTICLES