మెట్టజ్యోతి : దేవీపట్నం మండలం. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే కమలం పాలెం నుండి శరభవరం కోరుకొండ వెళ్లే రోడ్డు మార్గంలో గత నెల రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా రోడ్డు అంచు ప్రమాదకరంగా మారింది. రోడ్డు ప్రమాదకరంగా మారిన రోజులైనా సంబంధించిన శాఖ అధికారుల పట్టించుకోకపోవడం గమనాకారం. కనీసం ఆ ప్రమాదం ఉన్నచోట్ల డేంజర్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం. ప్రమాదం ఉన్నచోట అధికారులు గుర్తించి ఆ సమస్యను పరిష్కరించకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధింత అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.