రాయవరం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురుబాధ గ్రామంలో సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పన కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లో స్వచ్ఛతా హి సేవ పరిశుభ్రత సేవా కార్యక్రమలు భాగంగా పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, వ్యర్థ పదార్థాలు వెయ్యకూడదని, ప్లాస్టిక్ కవర్లు వినియోగించకూడదని ప్లే కార్డులు పట్టుకొని ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కొరకు గ్రామ ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కోరారు.అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు రొంగల బంగారయ్య,కెల్లా అప్పారావు, పైల శ్రీనివాసరావు సచివాలయ సెక్రెటరీ జి. సతీష్ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నదురుబాధ గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు
RELATED ARTICLES