ద్దాపురం : నేడు రాట ముహూర్తముతో స్థానిక వర్జులవారి వీధిలో వేంచేసి ఉన్న భువనేశ్వరి పీఠంలో దేవి నవరాత్రుల మహోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. తేదీ 26-09-2022 సోమవారం నుండి 05 -10- 2022 వరకూ జరగబోవు దేవి నవరాత్రులు సందర్బంగా ప్రధానంగా రాట ముహూర్తము జరిగినది. శ్రీ పెద్దాపురం పట్టణానికి చెందిన శ్రీ వేముల సత్య సాయి ప్రసాద్ శ్రీమతి అరుణ దంపతులచే నేటి ఉదయం 7గం. 57ని.లకు రాట ముహూర్తం జరిగినది. చింతా గోపిశర్మ మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ఈ దేవి నవరాత్రులు నిర్వహించుచున్నామని తెలిపారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారికి అభిషేకము సహస్రనామ కుంకుమ పూజాదికాలు, పార్థివ లింగార్చన చండి పారాయణ హోమాధికాలు జరుగుతాయి అని తెలిపారు. ప్రత్యక్ష పరోక్ష పూజలలోను హోమంలోను పాల్గొను భక్తులు 9866193557, 9989088557 ఈ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. దేవి మాల ధరించేవారు ముందుగా సంప్రదించమని తెలిపారు