కొత్తపేట : మెట్టజ్యోతి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుపై దాడులు చేయడం, ప్రతిపక్షాల సభలకు స్థలాలు ఇచ్చిన వారి ఇళ్ళను కూల్చడం రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సిపీ పార్టీ సంస్కృతి గా మార్చుకుందని రాష్ట్రటిడిపిఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు తీవ్రంగా దుయ్యబట్టారు.. బుధవారం కొత్తపేట మండలం అవిడి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సత్యానందరావు పరిశీలించారు.. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి, ఇప్పటం గ్రామంలో గ్రామస్తుల ఇళ్లను తొలగించడం, జనసేనాని పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యలు అన్నారు… రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు వైసిపి తెరతీసిందనిరాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందనిఅన్నారు.సిగ్గుఎగ్గు లేకుండావైసీపీనేతలుచేస్తున్న ప్రకటనలను, ముఖ్యమంత్రివైఖరినిప్రజాస్వామ్య వాదులందరూతీవ్రంగాఖండించాలనికోరారు.ఈకార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సూరంపూడి రామకృష్ణ, క్లస్టర్ ఇన్చార్జి రెడ్డి తాతాజీ, ఎలిశెట్టి రామకృష్ణ, చిల్లె ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
దాడులు, కూల్చడాలు వైసిపి సంస్కృతిగా మార్చుకుంది
RELATED ARTICLES