ఇందుకూరు గ్రామంలో నీరు లేక బిందెలతో నిరసన

0
151

మెట్టజ్యోతి : దేవీపట్నం మండలం. కొందరు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇందుకూరు గ్రామస్తులు నీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ ఇందుకూరు గ్రామంలో ఇందుకూరు గ్రామస్తులు శ్రీకృష్ణుడు గుడి వీధిలో ఖాళీ బిందెలతో అధికారుల తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు . ఇందుకూరు గ్రామంలో శ్రీకృష్ణుడు గుడి వీధి సమీప ప్రాంతంలో రెండు నెలలుగా ఇంటిదగ్గర వాడుకోవడానికి నీరు రాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్న సంబంధించిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మీడియాకు తెలియజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సమస్యను పట్టించుకోవడంలేదని అలాగే బోర్లు కూడా కొరత ఉండడంతో ఒక బిందనీరు కోసం బోర్ దగ్గర గంటల గంటలు ఉండవలసి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను సంబంధించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని లేకపోతే ఉన్నదాఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇందుకూరు గ్రామస్తులు పత్రిక ముఖంగా తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here